కేసీఆర్ నిజామాబాద్ పర్యటన టార్గెట్గా బీజేపీ ఎంపీ అరవింద్ ఇందూరులో భారీ సభ.. తగ్గేదేలే!!
ముఖ్యమంత్రి కెసిఆర్ సెప్టెంబర్ 5న నిజామాబాదులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీ కంటే రెండు రోజుల ముందుగా సెప్టెంబర్ 3న జరిగే బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఉతికి ఆరేస్తానని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ పర్యటనకు ముందే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ ఇందూరు జనతా కో జవాబ్ దో అనే నినాదంతో భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు.
Recommended Video

ప్రజలకు ఇచ్చిన హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి
ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హామీల అమలు పై సీఎం కేసీఆర్ కు ధర్మపురి అరవింద్ బహిరంగ లేఖ రాశారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి తనకు ఆహ్వానం అందలేదని పేర్కొన్న ఆయన, సీఎం నిర్వహించే సభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను టిఆర్ఎస్ పార్టీ ఒకటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. 2014, 2018 టీఆర్ఎస్ మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను, నెరవేర్చని వాగ్దానాలపై దృష్టి సారిస్తానని, కెసిఆర్ ‘తప్పిదాలు, కమీషన్లను' బయటపెడతానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు.

3 వ తేదీన ఇందూరు జనతా కో జవాబ్ దో సభ నిర్వహించనున్న అరవింద్
పట్టణంలోని బీఎల్ఎన్ గార్డెన్స్లో ఇందూరు జనతా కో జవాబ్ దే పేరుతో బహిరంగ సభ నిర్వహించి మరీ కేసీఆర్ ను టార్గెట్ చేయనున్నారు. అధికారిక సమీక్ష మరియు బహిరంగ సభకు తనకు సరైన ఆహ్వానం అందాలి. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం అందకపోతే సీఎం కార్యక్రమాలకు హాజరు కానని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి అవగాహన కల్పిస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై మరో లేఖ రాశారు అరవింద్.

హామీల అమలులో జాప్యం దేనికి.. సమాధానం చెప్పాలి
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి లేఖ, నివేదిక కాపీలను పంపిస్తామన్నారు. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే చర్యలేవీ చేపట్టలేదని మండిపడ్డారు. తన బహిరంగ లేఖలో లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుకడుగు వేస్తున్న విషయంపై వివరణ ఇవ్వాలన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం తప్ప మరొకటి కాదన్నారు. రానున్న మూడు నెలల్లో టీఆర్ఎస్ను బీజేపీ దుర్భర దశకు తీసుకు వెళ్లడం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

దళిత, గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం
సుమారు రెండున్నరేళ్ల క్రితం రైల్వే మంత్రిత్వ శాఖ మాధవనగర్ రైల్వే ఓవర్బ్రిడ్జిని మంజూరు చేసిందని, అంచనా పెట్టుబడిలో వాటాగా రూ.30 కోట్లు విడుదల చేసిందని అరవింద్ తెలిపారు. కానీ నేటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా పనులు ప్రారంభించలేదని అసహనం వ్యక్తం చేశారు. దళిత, గిరి జనుల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు.

బీహార్ వెళ్లి మరీ తెలంగాణా పరువు తీసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను విస్మరించారని, కనీసం కేసులు కూడా ఎత్తి వేయలేదని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. బీహార్ వెళ్లిన సీఎం కెసిఆర్ తెలంగాణ పరువు తీశారని ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకోసారి కేసీఆర్ ను బీహార్ రానివ్వకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మూడు నెలల తరువాత టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications