అక్కడే డౌట్!: బాబుపై చిరంజీవి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారా?
బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయించడం, గతంలో వచ్చిన రుద్రమదేవి సినిమాకు మినహాయించకపోవడంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.
హైదరాబాద్/విజయవాడ: బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయించడం, గతంలో వచ్చిన రుద్రమదేవి సినిమాకు మినహాయించకపోవడంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.
కేసీఆర్ ప్రభుత్వం నిన్న రుద్రమదేవికి, నేడు గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం బాలకృష్ణ సినిమాకు మాత్రమే మినహాయించడం అనుమానాలు రేకెత్తిస్తోందని అంటున్నారు.
స్వయంగా దీనిపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి సహా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

చారిత్రాత్మక సినిమాలకు రాయితీలు ఇవ్వడం మంచిదేనని, కానీ నేడు గౌతమీపుత్ర శాతకర్ణికి ఇచ్చి, నిన్న రుద్రమదేవికి ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోందని చిరంజీవి అన్నారు. రుద్రమదేవికి, గౌతమీపుత్ర శాతకర్ణికి తెలంగాణలో ఇచ్చారని, కానీ ఏపీలో మాత్రం బాలయ్య సినిమాకు మాత్రమే ఇచ్చారన్నారు.
చిరంజీవి వ్యాఖ్యలు పరోక్షంగా చూసినా, ప్రత్యక్షంగా అనుకున్నా.. చంద్రబాబు ప్రభుత్వాన్నే అన్నారని అంటున్నారు. నేరుగాపేరు ప్రస్తావించకపోయినా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత అయినందున ఆయన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.
చిరంజీవి కాపు ఉద్యమానికి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. చిరంజీవికి దాసరి నారాయణ రావు కూడా తోడు అయ్యారు. వీరు కాపు నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా నిలిచారు.
పన్ను మినహాయింపు పైన చిరంజీవి యథాలాపంగా అన్నప్పటికీ.. ఆయన కాంగ్రెస్ నేత కాబట్టి వాటిని రాజకీయంగా కూడా వ్యాఖ్యానించలేదని చెప్పడానికి లేదని అంటున్నారు.
ముద్రగడతో కలిసి దాసరి, చిరంజీవిలు పరోక్షంగా, ప్రత్యక్షంగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతగా చిరంజీవి ఈ అవకాశాన్ని కూడా పరోక్షంగా ఉపయోగించుకోలేదని చెప్పడానికి లేదని అంటున్నారు. అయితే, గౌతమీపుత్ర..కు ఇచ్చి, రుద్రమదేవికి ఇవ్వకపోవడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.
ఇదిలా ఉండగా, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను రాయితీపై హైకోర్టులో వ్యాజ్యం కూడా దాఖలైంది. ఆ చిత్రానికి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు.
బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బావమరిది కాబట్టి రాయితీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications