వేధింపులు: సీఐపై కమిషనర్కు మహిళా కానిస్టేబుళ్ల ఫిర్యాదు
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ నిత్యం తమను వేధిస్తున్నారని మహిళా సిబ్బంది సీపీ సుధీర్బాబుకు ఫిర్యాదు చేశారు.
వరంగల్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ నిత్యం తమను వేధిస్తున్నారని మహిళా సిబ్బంది బుధవారం పోలీసు కమిషనర్ సుధీర్బాబుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన బదిలీలలో స్టేషన్కు వచ్చిన ఆయన సిబ్బందిని ఇబ్బందికరమైన మాటలతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కమిషనరేట్లో ఏ పోలీసుస్టేషన్లో లేని విధంగా పరేడ్ చేయాలని మహిళా కానిస్టేబుళ్లపై ఒత్తిడి తెస్తున్నారని, గర్భిణులు అని కూడా చూడకుండా అవస్థలు పెడుతున్నారని వారు కమిషనర్కు తెలిపారు.

చెరువులోపడి మతిస్థిమితం లేని మహిళ మృతి
మతిస్థిమితం లేని మహిళ వడ్డేపల్లి చెరువులో పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కాజీపేట సీఐ రమేష్కుమార్ కథనం ప్రకారం... సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన గాల జ్యోతిరాణి(55) కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు సైకియాట్రిస్టు వద్దకు ఆరోగ్య పరీక్షలు చేయించి మందులు వాడుతున్నారు.
అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాజీపేట పట్టణంలో ఉన్న చిన్నమ్మ ఇంటికి జ్యోతిరాణితో కుమారుడు భవానిశంకర్ మంగళవారం వచ్చాడు. తల్లిని కాజీపేటలో వదిలిపెట్టి కొడుకు సికింద్రాబాద్ వెళ్లిపోయాడు.
కాగా, అందరూ పడుకున్న తరువాత బయటకు వచ్చిన జ్యోతిరాణి వడ్డేపల్లి కట్టపైకి చేరుకుని నీటిలో దూకి మరణించినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు భవానీశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications