వరదల వేళ సీఎం రేవంత్ కీలక నిర్ణయం..!!
తెలంగాణలో భారీ వర్షాలు..వరదలకు నష్టం ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ వరద సహాయక చర్యల పైన సమీక్ష చేసారు. మంత్రులు..అధికారులకు కీలక సూచనలు చేసారు. సూర్యాపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ పర్యటింనున్నారు. ఈ విపత్తు సమయంలో ఆదుకోవాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాసారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. వరద ప్రభావిత జిల్లాలకు నిధులు మంజూరు చేసారు.
రేవంత్ సమీక్ష
వరదల కారణంగా నష్టపోయిన జిల్లాల విషయంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయంగా ఒక్కో జిల్లాకు రూ.5కోట్లు అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలని రేవంత్ సూచించారు.

నిధుల విడుదల
భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని ఎనిమిది పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించేలా చూడాలని నిర్దేశించారు. ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలని సూచించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలని నిర్ణయించారు. వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ప్రధానికి లేఖ
తక్షణమే కేంద్ర సాయం కోరుతు ముఖ్యమంత్రి లేఖ రాసారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరారు. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేసారు. హైదరాబాద్ లో వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం, సూర్యాపేటలో రేవంత్ వరద పరిస్థితిని సమీక్షించనున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications