ఎస్సీ వర్గీకరణ బిల్లు 2025 ఆమోదం పొందడం ఒక మైలురాయి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో మంగళవారం ఎస్సీ (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) బిల్లు 2025 ఆమోదం పొందడం ఒక మైలురాయి నిర్ణయమని నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి ఏర్పాటు చేసిన కేబినెట్ ఉప కమిటీకి ఛైర్మన్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దశాబ్దాలుగా పరిష్కరించబడని డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు.
"ఇది చారిత్రాత్మకమైన రోజు. ఎస్సీ వర్గీకరణకు సంవత్సరాలుగా అన్ని వర్గాల మద్దతు ఉంది, కానీ ఎటువంటి నిర్మాణాత్మక పరిష్కారం సాధించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కింద, మేము ఈ దీర్ఘకాల డిమాండ్ను పూర్తి చిత్తశుద్ధితో నెరవేర్చాము," అని ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ అన్నారు.

వన్ మ్యాన్ కమిషన్ నియామకం
చర్చ సమయంలో, ముఖ్యమంత్రి తరపున మంత్రి దామోదర్ రాజనర్సింహ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చిందని, రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారాలలో ఈ విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి హైలైట్ చేశారు. మునుపటి ప్రభుత్వాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు.తాను 1999 నుండి ప్రతి అసెంబ్లీ సమావేశాలను ఫాలో అవుతున్నట్లు చెప్పిన ఉత్తమ్...అప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ గురించి చర్చించారని అన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని నిజం చేసిందని కొనియాడారు.
పంజాబ్, హర్యానా , తమిళనాడు వంటి రాష్ట్రాల నమూనాలను అధ్యయనం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం చక్కటి ప్రణాళికను రూపొందించింది.అక్కడ కూడా ఇలాంటి వర్గీకరణలు ఉన్నాయి. ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ను నియమించింది, ఇది ఎస్సీ ఉప కులాలపై సమగ్ర అధ్యయనం చేసింది.జనాభా, అక్షరాస్యత, ఉపాధి, ఉన్నత విద్యలో ప్రవేశాలు, రిక్రూట్మెంట్ ట్రెండ్స్, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యం వంటి డేటాను సేకరించిందని ఉత్తమ్ చెప్పారు.
ఫిర్యాదులు స్వీకరించిన ప్రభుత్వం
తెలంగాణలోని 59 ఎస్సీ ఉప కులాలను పరిశీలించడంలో షమీమ్ అక్తర్ కమిటీ కీలక పాత్ర పోషించిందని చెప్పిన ఆయన, న్యాయమైన వర్గీకరణను నిర్ధారించేందుకు అంతర్గత వెనుకబాటుతనాన్ని విశ్లేషించిందని చెప్పారు. కమిషన్ ప్రారంభంలో ప్రాథమిక నివేదికను సమర్పించింది, ఆ తర్వాత అనేక ఎస్సీ ఉప కులాలు ఆందోళనలను లేవనెత్తగా... ప్రతిస్పందనగా, వర్గీకరణ ప్రక్రియను ఖరారు చేయడానికి ముందు అన్ని ఫిర్యాదులను సమగ్రంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కమిషన్ పదవీకాలాన్ని ఒక నెల పొడిగించిందని గుర్తు చేశారు.
వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీల్లో వర్గీకరణను మూడు గ్రూపులుగా విభజించింది. గ్రూప్ I లో,ఎస్సీ జనాభాలో 3.288% ఉన్న 15 అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలకు 1% రిజర్వేషన్ కేటాయించారు. గ్రూప్ II లో,ఎస్సీ జనాభాలో 62.74% ఉన్న 18 మధ్యస్థంగా ప్రయోజనం పొందిన కులాలకు 9శాతం రిజర్వేషన్ కేటాయించారు.రిజర్వేషన్ల నుండి ఎక్కువగా ప్రయోజనం పొందిన 26 కులాలు,ఎస్సీ జనాభాలో 33.963% ఉన్నవారికి 5% రిజర్వేషన్ కేటాయిస్తూ మూడవ గ్రూపులో చేర్చారు.
ఏకగ్రీవ తీర్మానం ఆమోదించినప్పటికీ..
మొత్తం ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలనే డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ప్రస్తుతం, తెలంగాణలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా 15% రిజర్వేషన్ ఉంది. అయితే, వారి జనాభా 17.5% కి చేరుకుందని గణాంకాలు సూచిస్తున్నాయి.2026 జనాభా లెక్కల డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత,ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని సమాంతరంగా పెంచుతామన్నారు. అన్ని ఎస్సీ గ్రూపులకు సామాజిక న్యాయం చేకూర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక మద్దతును పునరుద్ఘాటిస్తూ,దాని అమలు కోసం ఎంఆర్పిఎస్ నాయకుడు కృష్ణ మాదిగతో కలిసి రాహుల్ గాంధీ ప్రచారం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అనేక రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ, ఎవరూ దానిని సమర్థవంతంగా అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications