పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్పై చర్యలు తీసుకోండి : లోక్పాల్కు కాంగ్రెస్ కంప్లైంట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై లోక్ పాల్ ను ఆశ్రయించింది కాంగ్రెస్. అధికార టీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది.
ప్రలోభాల పర్వం
రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఇది రాజకీయ అవినీతి కిందకు వస్తుందని ఫిర్యాదులో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి .. పార్టీలోకి లాక్కుంటున్నారని గుర్తుచేశారు. ఇది ఓ రాజకీయ పార్టీకి తగదని తెలిపింది. వెంటనే పార్టీ అధినేత కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

పార్టీ వీడుతున్న ఒక్కో ఎమ్మెల్యే ..
గత డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగి ... తిరిగి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రలోభాల పర్వానికి తెరతీసింది. విపక్ష కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఒక్కో ఎమ్మెల్యేతో మంతనాలు జరిపింది. ఇప్పటివరకు 11 మంది ఎమ్మెల్యేలు కారెక్కుందుకు సిద్ధమని ప్రకటించి ... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎల్పీ టీఆర్ఎస్పీలో విలీనం చేస్తారని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇటు టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించడంతో .. ఆ పార్టీకి సభలో ఎమ్మెల్యే లేని పరిస్థితి నెలకొంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications