టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్; ఢిల్లీ వెళ్ళొచ్చిన గులాబీ నేతల్లో గుబులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణా రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీలో కరోనా కలకలం కొనసాగుతుంది. గులాబి నేతలను కరోనా వెంటాడుతోంది. ఇటీవల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉండి వచ్చిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్
ఇప్పటికే తెలంగాణా పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా సోకగా తాజాగా ఎంపీ కేశవరావుకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలింది.
అయితే తనకు కరోనా సోకిందని, అయినా ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని ఎంపీ కేశవరావు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కేశవరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఢిల్లీ వెళ్లోచ్చిన ఎంపీ... కేశవరావు కలిసిన వారిలో కేంద్ర మంత్రులు, తెలంగాణా మంత్రులు
పార్లమెంటు సమావేశాల సమయంలో ఢిల్లీలో ఉన్న ఆయన సహచర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కూడా కలిశారు. ఇక న్యూఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా వీరంతా పలువురిని కలిశారు. ఇక ఇటీవల కేశవరావు కలిసిన వారిలో కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్ లో ఉండాలని ఎంపీ కేశవరావు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఢిల్లీ వెళ్ళొచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా .. హోం ఐసోలేషన్ లో మంత్రి
నాలుగు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ కరోనా చికిత్స తీసుకుంటున్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వారంతా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని, తనను కలవడానికి ఎవరూ తన క్యాంపు కార్యాలయానికి రావద్దని వెల్లడించారు. తాను క్షేమంగా ఉన్నానని, కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

చేవెళ్ళ ఎంపీకి కరోనా .. ఆందోళన చెందుతున్న గులాబీ నేతలు
ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి వచ్చిన బృందంలో ఎంపీ రంజిత్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన కూడా ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి బారిన పడిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీ కేశవరావు ఇద్దరూ ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వచ్చిన మంత్రులు, ఎంపీల బృందం లో ముగ్గురికి కరోనా సోకడంతో, మిగిలినవారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల వీరిని కలిసిన వారు సైతం ఆందోళనలో ఉన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications