కలాం నవ్వుతూ నమస్తే అన్నారు, ఆశ్చర్యమేసింది: సైబరాబాద్ సిపి ఆనంద్
హైదరాబాద్: దివంగత భారత రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంతో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. పన్నెండేళ్లుగా కలాంతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో గొప్పగా నిలపాలని తపించిన మహనీయుల్లో అబ్దుల్ కలాం అగ్రస్థానంలో నిలుస్తారని చెప్పారు.
తాను మధ్య మండల డిసిపిగా ఉన్న రోజుల్లో కలాంను కలిసినట్లు తెలిపారు. 2003లో రాష్ట్రపతి హోదాలో కలాం నగరంలోని ఆదర్శనగర్ బిర్లా ప్లానెటోరియాన్ని సందర్శించారు. ఆ సమయంలో తాను సెల్యూట్ చేస్తే.. కలాం నవ్వుతూ నమస్తే అన్నారని, అది తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.

ఆ రోజు శాస్త్రవేత్తలతో, విద్యార్థులతో గ్రహాల స్థితిగతుల గురించి, ప్రకృతి గొప్పతనం గురించి కలాం వివరించిన తీరు తనకు ఇప్పటికీ గుర్తుందని ఆనంద్ తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ స్కూల్లో విద్యార్థులతో ముచ్చటించారని చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టించే తత్వాన్ని అలవర్చుకోవాలని కలాం వివరించారని తెలిపారు.
ఆ తర్వాత కలాం ఎన్నోసార్లు హైదాబాద్లో విద్యాసంస్థలకు వచ్చినప్పుడు కలిసినట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు ఎన్నికల సంఘం నుంచి లభించిన పురస్కారాన్ని ఢిల్లీలో కలాం చేతుల మీదుగా అందుకోవడం ఎన్నటికీ మర్చిపోలేని అనుభూతి అని సివి ఆనంద్ తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications