ఆల్ ఖైదా దాడులకు ఛాన్స్: హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో హైఅలర్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో భారత దేశంలోని మెట్రో నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అల్ ఖైదా ఉగ్రవాదులు మెట్రో నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని హెచ్చరించారు.
సమాచారం మేరకు, ఆల్ ఖైదా ప్రజలు ఎక్కువగా ఉంటే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, భవనంతులు, ఆలయాలు తదితరాలను లక్ష్యం చేసుకోవచ్చునని సోమవారం నాడు హెచ్చరించాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.












Click it and Unblock the Notifications