హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ధర్నాలా? తెలంగాణలో భారీ ధాన్యం కుంభకోణం: ధర్మపురి అరవింద్ సంచలనం, డీకే అరుణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని, అది ఏ క్షణంలోనైనా వెలుగులోకి రావొచ్చని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగం అయిపోయిందని, రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారు

సీఎం స్థానంలో ఉండి ధర్నాలా?: ధర్మపురి అరవింద్ ఫైర్

సీఎం స్థానంలో ఉండి ధర్నాలా?: ధర్మపురి అరవింద్ ఫైర్

సమస్యలను తీర్చాల్చిన సీఎం కేసీఆర్ ధర్నా చేయడమంటే చేతకానితనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదని అరవింద్ మండిపడ్డారు. కేసీఆర్ ధర్నా చేస్తే దేశ ప్రజల ముందు తనను తాను దోషిగా నిలబెట్టుకున్నవారవుతారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అన్నిపంటలు కాకుండా కేవలం వరి పంట వేయాలని రైతులను కేసీఆర్ కోరారని, మార్క్ ఫెడ్ సంస్థను కేసీఆర్ నిర్వీర్యం చేసేశారని ధ్వజమెత్తారు.

రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టిన కేసీఆర్..: అరవింద్

రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టిన కేసీఆర్..: అరవింద్

తెలంగాణలో 7లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతుందని, మొక్కజొన్న పంట కొనుగోలును మార్క్‌ఫెడ్ సంస్థ కాకుండా దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించారని బండి సంజయ్ మండిపడ్డారు. రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారని, వ్యాపారుల సిండికేట్‌ల వల్ల రైతులు తక్కువ ధరకు మొక్కజొన్న పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారని ఆయన విమర్శించారు. ఎఫ్‌సిఐ కొనుగోలు చేయడం వల్ల తెలంగాణలో కేవలం వరి పంట సాగు చేయాలని కేసీఆర్ కోరారని, ఎటువంటి కష్టం లేకుండా రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు 370 రూపాయాలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌సిఐ ఇచ్చే డబ్బులతో కేసీఆర్ బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను నడుపుతున్నారని విమర్శించారు. రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యానికి కేంద్రం ఎఫ్‌సిఐ నుండి సకాలంలో డబ్బులు చెల్లిస్తుందని, అయితే తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యం సేకరణ చేసిన దానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్నారు. రైతుల అయోమయ పరిస్థతికి కేసీఆర్ కారణమని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. తెలంగాణ రైతులను కేసీఆర్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టి వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో భారీ కుంభకోణం: ధర్మపురి అరవింద్

తెలంగాణలో భారీ కుంభకోణం: ధర్మపురి అరవింద్


రైతుల నుంచి వరిధాన్యం సేకరణ సకాలంలో జరగడం లేదని, డబ్బులు చెల్లింపులు ఆలస్యం అవుతున్న దానిని ప్రశ్నించినందుకు బండి సంజయ్‌పై రాళ్ల దాడి చేశారని విమర్శించారు. దేశానికి మోడీ వరం అయితే, కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారారని, తెలంగాణ ప్రజలు, రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అన్నిరకాల ఖర్చులు ఎఫ్‌సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సేకరణ భాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే దాన్ని కూడా సరిగా నిర్వహించడం లేదు. పారాబాయిల్ రైస్ తప్ప, మిగిలిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తోందని తెలిపారు. వరిధాన్యం సేకరణను ఇప్పుడు కంప్యూటరీకరణ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గతంలో తక్కువ ధాన్యం సేకరణ చేసి రిజిష్టర్లలో ఎక్కువ సేకరించినట్లు నమోదు చేసేవారని అరవింద్ ఆరోపించారు. ఈ భారీ కుంభకోణానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సేకరణ ప్రక్రియను కంప్యూటరీకరణ చేసిందని, కేసీఆర్ కుటుంబ ఆధ్వర్యంలో జరిగే దళారుల కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ఎఫ్‌సిఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఈ కుంభకోణం ఏ క్షణంలోనైనా వెలుగులోకి రావొచ్చన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయంగా కొట్టుకుంటుంటే కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో, ఢిల్లీ వార్ రూంలో తమలో తాము కొట్టుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ హుజూరాబాద్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు..

కేసీఆర్ హుజూరాబాద్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు..

మరోవైపు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కూడా సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. వరిదాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. నల్గొండ జిల్లాలో వరి ధాన్యాల కొనుగోలు విషయంలో పర్యటించిన తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులే దాడి చేశారని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగిందని ఆరోపించారు. రాళ్ళతో గుడ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలను జీర్ణించుకోలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు డీకే అరుణ.

Recommended Video

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ డీకే అరుణ || Oneindia Telugu
కేసీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ దాడులు: డీకే అరుణ

కేసీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ దాడులు: డీకే అరుణ

ఇక వరి దాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులతో రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వపంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తరహాలనే స్థానిక నాయకులు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు బెట్టారని, ప్రజలను అనేక విధాలుగా మభ్య పెట్టారన్నారు. అయినా కూడా హుజురాబాద్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడుతాయన్నారు డీకే అరుణ. కేంద్రం ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పిందని, అయిన కూడా రాష్ట ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చెయ్యడం లేదని డీకే అరుణ ఆరోపించారు. వెంటనే ఐకేపీ కేంద్రాల వద్ద ఉన్న వరి ధన్యాలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీకే అరుణ డిమాండ్ చేశారు. కేంద్రంపై అబద్ధపు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

English summary
Dharmapuri Arvind and Dk Aruna slams CM KCR for crop purchase issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X