ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆలోచించాలన్న ప్రధాని మోడీ!!
తెలంగాణలో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన నా ప్రియమైన కుటుంబ సభ్యులారా అని ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
తెలంగాణను బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నాశనం చేశాయని, తెలంగాణ అంటే సాంప్రదాయానికి పెట్టింది పేరని, కానీ తెలంగాణాను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పేదల పట్ల నేరం చేశారని, బిజెపి ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్రూం ఇళ్ళ స్కామ్ ను, భూమాఫియాను, ఎడ్యుకేషన్, మాఫియాను బయటపెడతామని అన్నారు.

కురవి వీరభద్ర స్వామికి వందనాలు ,తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నా అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ను గద్దె దించాలని చూస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అన్నారు. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ కే గ్యారెంటీ అన్నారు.
తెలంగాణ అంటే సంస్కృతి సంప్రదాయాలు, సాంకేతిక కు పెట్టింది పేరని, కానీ కెసిఆర్ మూఢ నమ్మకంగా మార్చేశారన్నారు. బిఆర్ఎస్ కుంభకోణాలపై తెలంగాణ లో ఏర్పడే బీజేపీ సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు . కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే ,రెండు పార్టీలు కుటుంబ పార్టీలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాయన్నారు ప్రధాని మోడీ.

ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడం లేదు . బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అదుకుంటుంది. కరోన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి కానీ కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం ధరల నియంత్రణ చేసింది .
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు తగ్గించలేదన్నారు . తెలంగాణ లో డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఫార్మ్ హౌస్ సీఎం ను పంపాలి - బీసీ సీఎం ను ముఖ్యమంత్రి చేయాలన్నారు మోడీ . ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి అవసరమా మనకు.. అంటూ మోడీ ప్రశ్నించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications