సౌమ్య మృతిలో ఒకరి కంటే ఎక్కువ!: పోలీసులకు చుక్కలు, ఫేస్బుక్-వాట్సాప్ల పరిశీలన
హైదరాబాద్: సౌమ్య హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఎర్రగడ్డలోని నందన్ నగర్లోని ఓ అపార్టుమెంటులో ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు వారికి చిన్న ఆధారం కూడా లభించలేదని తెలుస్తోంది.
ఈ కేసు పట్ల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం సిటీ అడిషనల్ పోలీస్ కమిషనర్ చౌహాన్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు విషయంపై ఆరా తీశారు. కేసు దర్యాఫ్తు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

గదిలోకి వెళ్లి పరీశీలన
హత్య జరిగిన అపార్టుమెంటులోని గదికి వెళ్లి పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడి ఆచూకి కనిపెట్టాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు. సౌమ్య మృతదేహానికి బన్సీలాల్ పేటలో తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించారు.

బృందాలుగా విడిపోయి విచారణ
మనవడిని తీసుకొని తమ సొంతూరుకు వెళ్లిపోయారు. మరోవైపు, హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో భర్త నాగభూషణంతో పాటు పలువురిని పోలీసులు విచారించారు. అపార్టుమెంటులోని దాదాపు 25 మంది అనుమానుతులను విచారించారు.

పోలీసులకు చుక్కలు
సౌమ్యకు చెందిన ఫేస్బుక్, వాట్సాప్లను పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టకుండా, పకడ్బంధీగా అగంతకుడు హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందట.

ఒకరికంటే ఎక్కువ నిందితులు
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఒకరి కంటే ఎక్కువగా నిందితులు ఉన్నారని భావిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా, పక్కా ప్లాన్తో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. లైంగిక వేధింపుల కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications