నిమజ్జనానికి ఏపీ పోలీసులు: '33 ఏళ్ల తర్వాత గణేష్ నిమజ్జనం, బక్రీదు ఒకేసారి'
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం, బక్రీదు పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఘట్కేసర్లోని ఏదులాపురం చెరువును, యనంపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్పోస్టును ఆయన సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 సంవత్సరాల తర్వాత గణేష్ నిమజ్జనం, బక్రీదులు ఒకేసారి వచ్చాయన్నారు. ముందు జాగ్రత్తతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా ఉండేందుకు సైబరాబాద్ పరిధిలో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విగ్రహాల ప్రతిష్ట కోసం అధికంగా అనుమతులు వచ్చాయన్నారు. గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 25 చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. తద్వారా 10,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందన్నారు. గణేష్ నిమజ్జనం జరిగే చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏపీ పోలీసులు
హైదరాబాద్లో జరిగే గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏపీ పోలీసు సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు. ఈ మేరకు సిబ్బందిని కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 1761 మంది పోలీసు సిబ్బందిని నిమజ్జనోత్సవానికి కేటాయించారు. ఈ మేరకు ఏపీ శాంతిభద్రతల అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications