మాజీఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్, భార్య, కుమారుడికి కూడా, ఆస్పత్రిలో చికిత్స
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తోన్న పోలీసులను కూడా వదలడం లేదు. అయితే బీజేపీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతని భార్య, కుమారుడికి కూడా పరీక్షలు చేయగా.. వారికి కూడా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 199 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ సమయంలో చింతల రామచంద్రారెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అలా అందజేసిన సమయంలో వైరస్ ప్రబలి ఉంటుందని భావిస్తున్నారు. వైరస్ నిర్ధారణ తర్వాత అతని, భార్య కుమారుడికి కూడా పరీక్షలు చేశారు. వారికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే ముగ్గురికి జూబ్లీహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కరోనా పాజిటివ్ సోకడంపై చింతల రామచంద్రారెడ్డి స్పందించారు. తనకు వైరస్ సోకిందని.. అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఆందోళన చెందొద్దని బీజేపీ శ్రేణులు, కార్యకర్తలను కోరారు. వాస్తవానికి లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైన్స్ తెరవడం, బస్సులను నడపడంతో ఆ సంఖ్య రెట్టింపవుతోంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను సడలించినట్టు తెలుస్తోంది. కానీ వైరస్ కేసులు మాత్రం తీవ్రస్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications