రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్లక్ష్యం..!
నారాయణఖేడ్/హైదరాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 52 సంవత్సరాల రైతు అంతారం ఈర్రెడ్డి కి సత్యగామ శివారులో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సక్రమంగా పండకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా బేగంపేటకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాడు. మొదటి విడత రైతుబంధు కింద ఆయనకు 32,800 చెక్కు మంజూరైంది.

ఇక రెండో విడతకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈర్రెడ్డి ఇంటి పేరుతో పాటు బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా నమోదవ్వడం వల్ల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీంతో తన భూమి ఏమైపోతుందోనని ఈర్రెడ్డి తరచుగా దిగులు పడేవాడు. ఈనెల 7న సత్యగామకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి శుక్రవారం ఉదయం సొంత వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications