కొడంగల్లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీ, ముగ్గురి మృతి
తెలంగాణలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొని ముగ్గురు మృతి చెందిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వికారాబాద్ జిల్లా కొడంగల్ లోని ఐనన్పల్లి వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కర్ణాటకలోని గనుగాపూర్లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో బయలుదేరి వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వస్తుండగా.. చిట్లపల్లి-యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

బొలెరో వాహనం ఎదురుగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మృతదేహాలను కొండగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి మరణవార్తతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications