కొడంగల్‌లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీ, ముగ్గురి మృతి

తెలంగాణలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొని ముగ్గురు మృతి చెందిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ లోని ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కర్ణాటకలోని గనుగాపూర్‌లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో బయలుదేరి వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వస్తుండగా.. చిట్లపల్లి-యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

fatal-accident-in-kodangal-two-cars-collide-three-dead

బొలెరో వాహనం ఎదురుగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మృతదేహాలను కొండగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి మరణవార్తతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+