వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బిడ్డపై ఘాతుకం తండ్రి పనే, భార్య కూడా ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బట్వారం మండలంలో గిరిజన బాలిక పైన జరిగిన అత్యాచారం, హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆదివారం నాడు నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఘటన వివరాలను ఎస్పీ వెల్లడించారు.

మెగావత్‌ కమల్‌ కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేశాడని చెప్పారు. కట్టుకథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించాడని చెప్పారు. పది నిమిషాల్లోనే కమల్‌ భిన్న కథనాలు వినిపించాడన్నారు. అతని కాల్‌డేటాను పరిశీలించామని చెప్పారు.

కమల్‌ అబద్ధాలు చెప్పినట్లు ధ్రువీకరించుకున్నామన్నారు. కమల్ కదలికలను గమనించామని, అతను తెలిపిన వివరాల్లో తేడాలు కనిపించాయన్నారు. అబద్దాలు చెప్పాడన్నారు. తనకు ఏ పాపం తెలియదని మొదట బుకాయించే ప్రయత్నం చేశాడన్నారు.

 Father raped, killed girl: Police

కమల్ పైన అనుమానంతో కొందరితో కలిసి భార్య ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ తర్వాత కమల్ కూడా వారితో వచ్చి ఫిర్యాదు చేశాడన్నారు.

అతని పైన అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించామని, ఆయన చెప్పిన వివరాలు ఎక్కడా పొంతన లేవన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించినట్లు చెప్పారు.

English summary
In an inhuman act, a father has turned out to be the rapist and killer of his own daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X