ఆ బిడ్డపై ఘాతుకం తండ్రి పనే, భార్య కూడా ఫిర్యాదు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బట్వారం మండలంలో గిరిజన బాలిక పైన జరిగిన అత్యాచారం, హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆదివారం నాడు నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఘటన వివరాలను ఎస్పీ వెల్లడించారు.
మెగావత్ కమల్ కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేశాడని చెప్పారు. కట్టుకథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించాడని చెప్పారు. పది నిమిషాల్లోనే కమల్ భిన్న కథనాలు వినిపించాడన్నారు. అతని కాల్డేటాను పరిశీలించామని చెప్పారు.
కమల్ అబద్ధాలు చెప్పినట్లు ధ్రువీకరించుకున్నామన్నారు. కమల్ కదలికలను గమనించామని, అతను తెలిపిన వివరాల్లో తేడాలు కనిపించాయన్నారు. అబద్దాలు చెప్పాడన్నారు. తనకు ఏ పాపం తెలియదని మొదట బుకాయించే ప్రయత్నం చేశాడన్నారు.

కమల్ పైన అనుమానంతో కొందరితో కలిసి భార్య ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ తర్వాత కమల్ కూడా వారితో వచ్చి ఫిర్యాదు చేశాడన్నారు.
అతని పైన అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించామని, ఆయన చెప్పిన వివరాలు ఎక్కడా పొంతన లేవన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించినట్లు చెప్పారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications