మక్కా పేలుళ్ళలో దోషులెవరు, కేంద్రం వైఫల్యం: సర్వే సత్యనారాయణ
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ళ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను నిర్ధోషులుగా సోమవారం నాడు ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ కేసులో సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో కేంద్రం వైఫల్యం చెందిందని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అన్ని మతాలను గౌరవించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మక్కా పేలుళ్ళ కేసులో కోర్టు తీర్పు అనంతరం సోమవారం నాడు హైద్రాబాద్లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. భారత్ సెక్యులర్ దేశమన్నారు. అన్ని మతాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిన సమయంలో దేశం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా లౌకిక వాదాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడిందన్నారు.

మక్కా పేలుళ్ళకు ఎవరు పాల్పడ్డారనే విషయమే తేలకుండా పోయిందన్నారు. ప్రాషిక్యూషన్ వైఫల్యం వెనుక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు.ఈ పేలుళ్ళ సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video

11 ఏళ్ళ క్రితం మక్కా మసీదు పేలుళ్ళ కేసు చోటు చేసుకొంది. ఈ కేసులో ఐదుగురిని ఎన్ఐఏ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. స్వామి ఆసిమానంద, భరత్, దేవేందర్ గుప్తా, రాజేందర్, లోకేష్ శర్మలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది. మిగిలినవారిపై ఛార్జీషీటు కొనసాగుతుందని ప్రకటించింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications