ఏకంగా గంజాయి చాక్లెట్లు.. గంజాయి దందాలో ఎంతగా ముదిరిపోయారబ్బా!!
మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి గంజాయి. గంజాయి తెలుగురాష్ట్రాల్లో చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే ఉంది. గంజాయి స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడకుండా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించడంతో పాటు, గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా గంజాయి దందా సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటుంది. ఇక ఏకంగా పోలీసులకు చిక్కకుండా చాక్లెట్ రేపర్ లలో గంజాయి చాక్లెట్లను పెట్టి విక్రయిస్తున్నారు అంటే ఎంతగా గంజాయి దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా పటాన్చెరులో గంజాయి దందా చేస్తున్న కేటుగాళ్లు, గంజాయి కి అలవాటు పడిన వారికి గంజాయి చేర్చడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. చాక్లెట్ రేపర్లలో చాక్లెట్ల రూపంలో గంజాయి నింపి, చార్మినార్ గోల్డ్ మునఖ్చా పేరుతో విక్రయిస్తున్నారు. పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో గంజాయి ని చొప్పించి చాక్లెట్లు విక్రయాలు జరుపుతూ, చిన్నారులను కూడా గంజాయికి బానిసలుగా తయారు చేస్తున్నారు.

ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పటాన్చెరు పరిసర ప్రాంతాల్లోని పాన్ షాప్ లు, ఇతర షాపులలో ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న క్రమంలో ఎక్సైజ్ పోలీసులు గురువారం నాడు వారిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు పటాన్చెరు మండలం పాశమైలారం, ఇన్స్నాపూర్ పరిధిలోని మూడు పాన్ షాపుల్లో ఇన్స్పెక్టర్ సీతారాంరెడ్డి నేతృత్వంలోని ఎక్సైజ్ అధికారులు 271 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పాన్ షాప్ యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఒడిశాకు చెందిన ముగ్గురు గంజాయి దందా చేసే వారు అనిమేష్ దాస్, రంజిత్ భద్ర, బ్రిజు మోహన్ పాత్రలను పట్టుకున్నారు. ఇక ఈ గంజాయి దందా వ్యవహారంలో వెనుక ఎవరెవరు ఉన్నారు? ఈ చాక్లెట్లను ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు? ఈ చాక్లెట్లలో ఎంతమేరకు గంజాయిని పెడుతున్నారు? ఎలా సరఫరా చేస్తున్నారు? వంటి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications