మద్యం తాగించి, యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్
వరంగల్: ఓ యువతిని దుండగులు నమ్మించి శనివారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కరీంనగర్ జిల్లా వీణవంకలో యువతిపై ఈ ఘోరం చోటు చేసుకుంది.
ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెతో స్నేహం నటించిన ఐదుగురు గ్రామ యువకులు ఆమెకు మద్యం అలవాటు చేశారు. శనివారం యువతికి ఫుల్లుగా మద్యం తాగించారు.
చీకటి పడ్డాక చెట్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అటుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడాన్ని చూసి యువకులు పారిపోయారు. అనుమానించిన పోలీసులు చెట్లపొదల వద్దకు వెళ్లి సృహకోల్పోయిన యువతిని గుర్తించి వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మరుసటిరోజు కోలుకున్న యువతి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఐదుగురు నిందితుల్లో ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని తెలిసింది.
నిందితుల్లో ఓ ఆర్మీ జవాన్ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతికి, యువకులకు మధ్య రాజీ కుదుర్చడానికి పోలీసులు తొలుత ప్రయత్నాలు చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.