ప్రాధేయపడినా వినలేదు, వేధింపులు భరించలేక ఆ బాలిక ఏం చేసిందంటే?
ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తుండడంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లోని మీర్ పేటలో చోటుచేసుకొంది.
హైదరాబాద్ :ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తుండడంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లోని మీర్ పేటలో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ లోని సైదాబాబాద్ కు చెందిన వాణి అనే బాలిక మీర్ పేటలో ని మురళీకృస్ణా నగర్ లోని చిన్నమ్మ లక్ష్మి వద్ద ఉంటోంది. వాణి కి తల్లిదండ్రులు లేరు. దీంతో ఆమె తన చిన్నమ్మ లక్ష్లి వద్దే ఉంటుంది.
గతంలో హస్టల్ లో వాణి ఉండేది. ఏడు మాసాల క్రితం ఆమె చదువు మానేసింది. చిన్నమ్మతోనే ఉంటూ పనులకు వెళ్తోంది. అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంతో అనే యువకుడు వాణిని కొన్నినెలలుగా ప్రేమించాలని వేధిస్తున్నాడు.

బుదవారం నాడు సాయంత్రం కూడ వాణిని ప్రేమించాలని శ్రీకాంత్ వేధించాడు. వాణి చిన్నమ్మ లక్ష్మి కూడ శ్రీకాంత్ ను ఈ విషయమై ప్రాధేయపడింది. తల్లిదండ్రులు లేని అమ్మాయి వాణి వెంటపడి వేధించకూడదని ఆమె కోరింది.
అయినా శ్రీకాంత్ మాత్రం తన వేధింపులను మాత్రం ఆపలేదు. ఈ వేధింపులకు తీవ్ర మనస్థాపానికి గురైన వాణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications