Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ పథకంలో రూ. 4లక్షలు రాయితీ.. రైతులకు భారీ శుభవార్త!

తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందిస్తోంది. తాజాగా వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పురుగు మందులు, సూక్ష్మ పోషకాల పిచికారీకి డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.

ఆ కేంద్ర పథకం ద్వారా రైతులకు లబ్ది చేకూర్చనున్న రాష్ట్ర ప్రభుత్వం

రైతుల అవసరాలను గుర్తించి, వారి విజ్ఞప్తి మేరకు, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ డ్రోన్లను రాయితీపై అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం అందిస్తున్న 'సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం)' పథకం కింద వివిధ వ్యవసాయ యంత్రాలను రైతులకు రాయితీపై అందించనున్నారు.

good news to farmers telangana govt said In SMAM scheme Rs 4 lakh subsidy on agricultural drones

ఒక్కో డ్రోన్‌పై 40% సబ్సిడీ

ప్రభుత్వం ఇచ్చే రాయితీ కింద చిన్న, సన్నకారు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), మహిళా రైతులకు ఈ డ్రోన్లు అందుబాటులో ఉంటాయి. తొలి దశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 10 చొప్పున డ్రోన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో డ్రోన్‌పై 40% సబ్సిడీ ఇవ్వనున్నారు. అంటే గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీ అందనుంది. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు సైతం ఈ డ్రోన్లు అందిస్తారు.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో బెనిఫిట్ ఇదే

డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70% నుంచి 80% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎరువులు, సూక్ష్మపోషకాలు సమానంగా పంటకు ఈ విధానంలో అందుతాయని మంత్రి తుమ్మల వివరించారు. కూలీల ఖర్చులు తగ్గి రైతులకు లాభాలు వస్తాయన్నారు. ఆధునిక టెక్నాలజీని రైతు సంఘాలకు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఎలా అప్లై చేసుకోవాలో చెప్పిన మంత్రి

డ్రోన్ల వినియోగంతో సమయం ఆదా అవ్వటమే కాకుండా, రైతులకు ఖర్చు తగ్గుతుంది కాబట్టి రైతులు కూడా వీటి వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. ఎస్ఎంఏఎం పథకం అర్హతలు, రాయితీ శాతం, దరఖాస్తు విధానం వంటి అన్ని వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాల్లో లభిస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే 9,936 వ్యవసాయ యంత్రాలకు రాయితీ

2025-26 సంవత్సరంలో ఇప్పటికే 9,936 వ్యవసాయ యంత్రాలకు రూ.28.74 కోట్ల రాయితీ అందించామని ఆయన తెలిపారు.మిగిలిన పరికరాలను రాబోయే 10-15 రోజుల్లో రైతులకు అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+