వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ .. మొక్కలు నాటిన అమితాబ్, నాగార్జున .. హర్షం వ్యక్తం చేసిన సంతోష్

|
Google Oneindia TeluguNews

వృక్షో రక్షతి రక్షితః అంటారు. అటువంటి వృక్షాలను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడతాయి. మన భావి తరాలను కాపాడతాయి. అంతేకాదు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాకుండా, మానవ మనుగడ ప్రమాదంలో పడకుండా ఉంటుంది. భావితరాలకు బంగారు భవిష్యత్తును కానుకగా ఇచ్చినట్టు ఉంటుంది. ఇక ఇదే నినాదంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.

<strong>కేటీఆర్ పుట్టినరోజు : లక్షల మందికి మార్గదర్శక శక్తిగా, చిరంజీవి,సోనుసూద్ తోపాటు ప్రముఖుల విషెస్ !!</strong>కేటీఆర్ పుట్టినరోజు : లక్షల మందికి మార్గదర్శక శక్తిగా, చిరంజీవి,సోనుసూద్ తోపాటు ప్రముఖుల విషెస్ !!

దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా మొక్కలు పెంచాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొక్కలు పెంచాలన్న నినాదంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ ఉద్యమం విస్తృత ప్రచారాన్ని పొందడమే కాకుండా అందరినీ మొక్కలు నాటేలా చేస్తుంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

 రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటిన అమితాబ్ ... ఎంపీ సంతోష్ కు ప్రశంస

రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటిన అమితాబ్ ... ఎంపీ సంతోష్ కు ప్రశంస

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మొక్కలు నాటారు. రామోజీ ఫిలిం సిటీ లో కార్యక్రమంలో పాల్గొన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించారు. రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటి తాను భాగాస్వామినని చెప్పారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అమితాబ్ తో పాటు మొక్క్కలు నాటిన నాగార్జున , అశ్వనీదత్

అమితాబ్ తో పాటు మొక్క్కలు నాటిన నాగార్జున , అశ్వనీదత్

ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ 16 కోట్ల మొక్కలు నాటించారని కొనియాడిన అమితాబ్ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటుగా ఎంపీ సంతోష్ కుమార్ హీరో నాగార్జున నిర్మాత అశ్వినీ దత్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున సైతం పిలుపునిచ్చారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్న వారికి కృతఙ్ఞతలు చెప్తున్న సంతోష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్న వారికి కృతఙ్ఞతలు చెప్తున్న సంతోష్

దీంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో మైలు రాయిని సాధించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో వివిధ రంగాల ప్రముఖులు పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడమే కాకుండా, తన అభిమానులకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. బిగ్ బీ అమితాబచ్చన్ వంటి ప్రముఖులు కూడా ఛాలెంజ్ కు మద్దతు పలకడంతో జాతీయస్థాయిలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేపట్టిన ప్రయత్నానికి గుర్తింపు వచ్చినట్లయింది. తన సంకల్పాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంపీ సంతోష్ కృతజ్ఞతలు చెప్తున్నారు.

English summary
Bollywood superstar Big B Amitabh Bachchan planted seedlings today as part of the Green India Challenge. Big B Amitabh Bachchan, who was present at the event at Ramoji Film City, lauded MP Joginipalli Santosh Kumar for doing a good job that will benefit future generations. Everyone called for plants to be planted as part of the Green India Challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X