పుస్తె సహా రోల్డ్ గోల్డ్: వరుడికి చావు దెబ్బలు
మెదక్: పెళ్లి రోజే మోసం చేయడానికి ప్రయత్నించిన వరుడికి దెబ్బలు, తిట్లే తలంబ్రాలుగా కురిశాయి. పుస్తెతో సహా ఆభరణాలన్నీ రోల్డ్గోల్డ్వి తీసుకొచ్చిన వరుడు చావు దెబ్బలు తిన్నాడు. వధువు కుటుంబ సభ్యుల తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. దాంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
మెదక్ జిల్లాలో బుధవారం ఓ పెండ్లిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. మెదక్కు చెందిన యువతికి దుబ్బాకకు చెందిన బుర్జోజీ రాజయ్య, సత్తమ్మల కొడుకు ప్రభాకర్తో పెండ్లి కుదిరింది. గత నెల 5న నిశ్చితార్థం సందర్భంగా రెండున్నర తులాల బం గారం, పది గ్రాముల కమ్మలు బుట్టాలు, రూ.1.10 లక్షలు నగదును కట్నంగా పెళ్లికూతురు తల్లిదండ్రులు అప్పజెప్పారు. బుధవారం మెదక్లోని భారత్ ఫంక్షన్ హాల్లో వివాహం కూడా జరిపించారు.
తర్వాత వధువు మెడలో కట్టిన తాళితోపాటు ఇతర బంగారు ఆభరణాలన్నీ రోల్డ్గోల్డ్గా కనిపించాయి. పెళ్లికొడుకును, తల్లిదండ్రులను పెళ్లికూతురు బంధువులు నిలదీయగా అన్నీ రోల్డ్గోల్డ్వని ఒప్పుకున్నారు. ఆగ్రహించిన వధువు బంధువులు వరుడుని అదే మండపంలో చితకబాదారు.
విషయం తెలుసుకున్న మెదక్ పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వరుడిని, తల్లిదండ్రులను పోలీస్స్టేషన్కు తరలించారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఐపీసీ 420 ప్రకారం చీటింగ్ కేసు నమోదుచేశారు. వరుడి తరపున పెండ్లికి కేవలం ఐదుగురు మాత్రమే హాజరుకావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.