అంతుందా?: షాకిచ్చిన అనుచరులు, రేవంత్ దూకుడుకు కాంగ్రెస్ ఝలక్
వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. రేవంత్ వరుసగా పలువురు నేతలను కలుస్తున్నారు.
హైదరాబాద్: వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. రేవంత్ వరుసగా పలువురు నేతలను కలుస్తున్నారు.
ఇందులో భాగంగా పార్టీలో చేరకముందే డీకే అరుణ వంటి నేతలను కలిశారు. ఆ తర్వాత రేణుకా చౌదరి, సబితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్యలను కలుస్తున్నారు. పార్టీలో అందరి మద్దతు కూడబెట్టుకునేందుకు ఆయన కలుస్తున్నారు.

అప్పుడే సవాల్కు కాంగ్రెస్ సిద్ధంగా లేదా
రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సమర్పించారు. దానిని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ స్పీకర్కు పంపించాల్సి ఉంది. తెలంగాణ స్పీకర్ వద్దకు వస్తే ఆయన ఆ రాజీనామా పత్రాన్ని వెంటనే ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడే తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.

రేవంత్కు దూరంగా సన్నిహితులు
ఇటీవల రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో పలువురు నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించకుండా ఉప ఎన్నికలపై దూకుడుగా వ్యవహరించవద్దనే ఆలోచనతో ఉందని తెలుస్తోంది.

రేవంత్ సామర్థ్యంపై ఆరా తీస్తున్న పెద్దలు
సొంత నియోజకవర్గంలోనే పలువురు నేతలు రేవంత్కు దూరంగా జరుగుతుండటానికి తోడు, ఆయన సామర్థ్యంపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కుంతియా, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఢిల్లీ పెద్దలు చర్చిస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రావడం వల్ల పార్టీకి ఎంత మేర ఫలితం, ఉపఎన్నికలు వస్తే ఆయన గెలుస్తారా అనే అంశాలపై ఆరా తీస్తోందని తెలుస్తోంది.

ఆ తర్వాతే నిర్ణయానికి వస్తారు
అందరి నుంచి పూర్తిస్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకున్న అనంతరం కొడంగల్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఉప ఎన్నికకు అనుకూలంగా ఉండి, రేవంత్ను గెలిపించుకుంటే, ఆ తర్వాత అధికార పార్టీపై కాంగ్రెస్ మరింత ఒత్తిడి తెచ్చే అవకాశముంది. అయితే రేవంత్ మాత్రం ఉప ఎన్నికపై దూకుడుగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం దూకుడుగా లేరు. ఆలోచించి ముందుకెళ్లే యోచనలో ఉన్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications