కరోనాతో భర్త మృతి .. తట్టుకోలేక బిల్డింగ్ పై నుండి దూకి భార్య ఆత్మహత్య
ఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. సంతోషంగా బ్రతుకు తున్న వారి కాపురంలో కరోనా చిచ్చు పెట్టింది. కరోనా సోకిన భర్త మృతి చెందగా, భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య బిల్డింగ్ పైనుండి దూకి సూసైడ్ చేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని నేరెడ్ మెట్ లో చోటు చేసుకున్న ఈ విషాదం స్థానికులను ఆవేదనకు గురి చేసింది.
మేడ్చల్ జిల్లా నేరెడ్ మెట్ సైనిక్ పురి అంబేద్కర్ నగర్ కు చెందిన తడకమళ్ళ వెంకటేష్ వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కరోనా కారణంగా బంధు మిత్రులు ఎవరు వారి ఇంటికి రావాలంటేనే భయపడ్డారు . అయితే వెంకటేష్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించటంతో ఆయన మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది భార్య ధనలక్ష్మి . భర్త లేకుండా బ్రతలేనని భావించింది .

వెంకటేష్ డెడ్ బాడీ ఇంట్లో ఉండగానే బిల్డింగ్ పైనుండి దూకి ప్రాణాలు తీసుకుంది. నేరెడ్ మెట్ పోలీసులు ఇద్దరు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి, కరోనా నిబంధనల మేరకు అంత్యక్రియలు జరిపించారు. భర్త లేకుంటే ఉండలేని భార్య , భర్త మరణంతో, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
భార్యాభర్తల మధ అనుబంధానికి అర్ధం మరచిపోతున్న వారు ఉన్న నేటి రోజుల్లో చావులోనూ నిన్ను వీడను అంటూ భర్తపై భార్య చూపించిన ప్రేమ నిరుపమానం .
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications