హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆఖరికి రక్తాన్ని కూడా.. : 'కల్తీ రక్తం' దందా గుట్టు రట్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కాదేది కల్తీకి అనర్హమన్నట్టు..! ఆఖరికి రక్తాన్ని కూడా కల్తీ చేసి ప్రాణాలతో చెలగాటమాడే రోజులొచ్చాయి. తాజాగా హైదరాబాద్ లోని కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో నరేంద్ర ప్రసాద్ అనే ల్యాబ్ టెక్నీషియన్ రక్తంలో సెలైన్ కలిపి కల్తీ చేస్తున్న ఘటన వెలుగు చూసింది. విషయం తెలిసిన పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి వెళ్లగా, అప్పటికే పరారయ్యాడు నిందితుడు.

దీన్నో దందాగా మార్చుకున్న నరేంద్ర ప్రసాద్ ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా కల్తీ రక్తాన్ని విక్రయిస్తూ గర్భిణీలు, బాలింతల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రి అడ్డాగా కల్తీ రక్తం దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాడు ఈ ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్.

నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఈ ఆసుపత్రిలో.. కల్తీ రక్తం దందాను ఆసుపత్రి వైద్యాధికారులు కూడా గుర్తించకపోవడం గమనార్హం. సరూర్‌ నగర్ ప్రాంతానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ నరేంద్ర ప్రసాద్, దాదాపుగా ఏడాది కాలం నుంచి రక్తంలో గ్లూకోజ్ వాటర్ కలిపి, ఆ బ్లెడ్ ప్యాకెట్లకు నగరంలో పేరు మోసిన బ్లడ్‌ బ్యాంక్‌ల నకిలీ స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నాడు.

ఇదేమి తెలియని రోగులు వాళ్ల అవసరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2000లకు కల్తీ రక్తాన్ని కొనుక్కుని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఓ రోజు జ్వరం కారణంగా నరేంద్ర ప్రసాద్ ఆసుపత్రికి రాకపోవడంతో, అతని స్థానంలో విధులకు హాజరైన ఇతర ఉద్యోగులు రక్తం కల్తీ కావడాన్ని గుర్తించారు. బుధవారం
ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌ లో నిలువ ఉంచిన ప్యాకెట్లలో తేడాను గుర్తించిన సిబ్బంధి, వెంటనే బ్లడ్‌ బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులకు సమాచారమిచ్చారు.

విషయం తెలుసుకున్న అసోసియేషన్ ప్రతినిధులు హుటాహుటిన సరూర్‌ నగర్‌లో ని నరేంద్ర ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వివిధ ప్రముఖ బ్లడ్‌ బ్యాంకులకు సంబంధించిన నకిలీ స్టిక్కర్లు, రక్తం నిల్వ ఉంచే ఖాళీ ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లో దొరికిన నకిలీ స్టిక్కర్లపై ఉన్న తేదీల ఆధారంగా సంబంధిత బ్లడ్‌ బ్యాంక్ నిర్వాహకులని సంప్రదించిన అసోసియేషన్ ప్రతినిధులు, విషయం గురించి ఆరా తీశారు. కాగా.. బ్లడ్ ప్యాకెట్లు తాము సరఫరా చేయలేదని ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు తేల్చేయడంతో కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల ఫిర్యాదు మేరకు సుల్తాన్‌ బజార్ ఎస్సై నరేశ్‌కుమార్ నేతృత్వంలో ఈ దందా భాగొతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కల్తీ విషయంలో నరేంద్రకు ఇంకెవరైనా సహకరించారా అని ఆరా తీస్తున్న పోలీసులు ఆసుపత్రి అధికారులను, సిబ్బందిని విచారించారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై నరేశ్‌కుమార్ తో పాటు, ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల తెలిపారు.

English summary
A lab technician named Narendra Prasad mixed blood and saline in the government blood bank at Koti Maternity Hospital. When the police and drug inspectors went to arrest him he ran away and is absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X