Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'బలవంతుడి టైం అయిపోయే దాక బలహీనుడు సైలెంట్‌​గానే': జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి (Jagga Reddy) ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తలో నిలిచే నేత. తాజాగా, అలాంటి ఆసక్తకర వ్యాఖ్యలే చేశారు. 'బలవంతుడు - బలహీనుడు కథ' అంటూ ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారాయన. రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని పంపించారు. ధిష్ఠానం ఆదేశిస్తే కాంగ్రెస్​ పార్టీ అభివృద్ధికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

'ఒక బలవంతుడు భూమి మీద ఎప్పటికీ బలవంతుడిగా ఉండలేడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడు. అతడు ఏదో ఒక రోజు బలహీనుడు కాక తప్పదు. అది ఏ వ్యవస్థలోనైనా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అంతే. అలాగే బలహీనులు ఎప్పటికీ బలహీనులుగా ఉండరు' అంటూ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్​ పార్టీకి, ప్రజలకు ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక సందేశం ఇవ్వడం గమనార్హం.

I will work for party and people: Former MLA Jagga Reddy Press Note Release

'బలవంతుడి సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు. బలహీనుడు తన టైం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాలం చేసే నిర్ణయంలో బలహీనుడు ఒక రోజు బలవంతుడు అవుతాడు. మనిషి జీవితం యవ్వనం నుంచి ముసలితనం వరకు ఎలాగైతే సాగుతుందో అలాగే ఈ బలవంతుడు బలహీనుడి కథ కూడా అంతే. ఒక నాయకుడి గెలుపు, ప్రజలను పరిపాలించే సమయం. ఒక నాయకుడి ఓటమి, గత పరిపాలనలో ఉన్న లోపాలు. ఆ లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి ముందడగు వేసే సమయం' అంటూ జగ్గారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేగాక, తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో 3 సార్లు సంగారెడ్డి ప్రజలు తనను గెలిపించుకున్నారని జగ్గారెడ్డిగా తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మంచి పరిపాలన చేశానని వివరించారు. మొదటిసారి 2014లో ఓడిపోయినా.. ఆ ఓటమి తనకు చాలా అనుభవాలు నేర్పిందన్నారు. అలాగే ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఓడిపోయానని తెలిపారు. అయితే, ఈ పది రోజుల్లోనే చాలా అనుభవాలు నేర్చుకున్నానని చెప్పారు.

ఈసారి తమ సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు విశ్రాంతి​ ఇచ్చారని జగ్గారెడ్డి చెప్పారు. అందుకే ఈ సమయాన్ని తాను పూర్తిగా పార్టీ కోసం పని చేసేందుకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 6 గ్యారెంటీలను తెలంగాణలో అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే తాను ఎమ్మెల్యేగా లేకపోయినా సంగారెడ్డి ప్రజలకు కూడా ఆ పథకాలను అందేలా కృషి చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఆలోచనను కాంగ్రెస్​ నాయకత్వానికి, ప్రభుత్వంలోని ఉన్న నాయకత్వానికి, నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్​ పార్టీ అభిమానుకు, రాష్ట్ర ప్రజలకు తెలియ జేస్తున్నట్లు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+