ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ... అసలేం జరిగిందంటే
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా తొలి రోజున ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించటం షాక్ కు గురి చేసింది . పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచలనం కలిగించింది.
హనుమకొండ కిషన్ పురా లోని ఆర్ డి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న రక్షా రావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరీక్ష రాస్తున్న రక్షా రావు వద్ద స్లిప్ ఉండడం గమనించిన ఇన్విజిలేటర్ ఆమెను బయటకు పంపించారు. దీంతో అవమానంగా ఫీల్ అయిన విద్యార్థిని రక్షా రావు కళాశాల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది .
ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రశ్న విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయకూడదు అని తెలిసి కూడా కాపీయింగ్ కు పాల్పడుతూ పట్టుబడి ఇన్విజిలేటర్ బయటకు పంపారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అటు విద్యాశాఖ అధికారులను, ఇటు సమాజాన్ని షాక్ కి గురి చేస్తుంది.