వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారాన్ని పేస్టుగా మార్చి అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

|
Google Oneindia TeluguNews

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమ రవాణా అధికారులు ఎంత భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా జరుగుతూనే ఉంది . శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. ఇందుకోసం అక్రమమార్కులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.

In the form of paste gold smugling ..caught by customs officers

తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఓ వ్యక్తి బంగారాన్నిస్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.పేస్టు రూపంలో హైదరాబాద్‌కు తరలిస్తున్న 1కిలో164 గ్రాముల బంగారంతో పాటు నిందితుడిని పట్టుకున్నారు. ఖతార్ రాజధాని దోహా నుంచి హైదరాబాద్‌కు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్‌గా మార్చి దానిని ప్యాంట్, లో దుస్తుల్లో చుట్టి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.37 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
The gold smuggling took place in the checks conducted by the customs officers at Shamshabad Airport. 1,164 grams of gold was mobilized from Khatar to Hyderabd in the form of paste. The case was registered by the Airport Police and investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X