బంగారాన్ని పేస్టుగా మార్చి అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమ రవాణా అధికారులు ఎంత భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా జరుగుతూనే ఉంది . శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. ఇందుకోసం అక్రమమార్కులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు.శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఓ వ్యక్తి బంగారాన్నిస్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.పేస్టు రూపంలో హైదరాబాద్కు తరలిస్తున్న 1కిలో164 గ్రాముల బంగారంతో పాటు నిందితుడిని పట్టుకున్నారు. ఖతార్ రాజధాని దోహా నుంచి హైదరాబాద్కు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానంలో వచ్చిన ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్గా మార్చి దానిని ప్యాంట్, లో దుస్తుల్లో చుట్టి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.37 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.