ఆసక్తికరం: జానారెడ్డి ఒక్కడే ఉంటాడా, టిఆర్ఎస్లో చేరుతావా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ మధ్య శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ మధ్య శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది. పార్టీ మారే విషయమై ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషన చోటుచేసుకొంది.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పార్టీలోకి ఎప్పుడు వస్తావని అడిగారు. ఇందుకు సమాధానంగా 'అయితే మా పార్టీలో జానా రెడ్డి ఒక్కడే ఉంటాడా' అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎదురు ప్రశ్నించారు.

ఈ సమాధానం విన్న పువ్వాడ 'నువ్వు కూడా వస్తున్నావా' అని చమత్కరించారు. అయితే టిఆర్ఎస్లో చేరే విషయమై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం దాట వేశారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం గతంలో సాగింది. అయితే ఈ ప్రచారాన్ని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఖండించారు.
నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్కు మంచి ఆదరణే ఉంది. వీరిని పార్టీలోకి చేర్చుకుంటే టీఆర్ఎస్కు జిల్లాలో తిరుగుండదనే అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ నుండి సానుకూల సంకేతాలు రావడం లేదనే ప్రచారం కూడ లేకపోలేదు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications