అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు
హైదరాబాద్ : రాజనీతిజ్ఞుడు, అజాతశత్రువు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో అంతిమ సంస్కరాలను ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి నిర్వహించారు. జైపాల్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీలకతీతంగా నేతలు తరలివచ్చారు.
అంతకుముందు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి గాంధీభవన్కు జైపాల్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. అక్కడ తమ నేతను కడసారి చూసేందుకు శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులు జైపాల్ రెడ్డి పార్థీవదేహానికి అంజలి గటించారు. జైపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. 1964 నుంచి తనకు జైపాల్ రెడ్డితో సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు మల్లిఖార్జున ఖర్గే. విద్యార్థి దశనుంచి ఆయన పరిచయమని తెలిపారు.

జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కే కేశవరావు, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్, జేసీ దివాకర్ రెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డి, డీ శ్రీనివాస్, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, హరీశ్ రావు , గుత్తా సుఖేందర్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భగా జైపాల్ రెడ్డిని స్మరించుకున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications