ప్రేమ విఫలం..!: ఫ్యాన్కు ఉరేసుకుని జేఎన్టీయూ విద్యార్ధిని ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ధర్మారెడ్డి కాలనీలో స్ధానిక వసుంధర ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న అపర్ణ(20) గురువారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమవడంతోనే ఇలా చేసి ఉంటుందని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లాంటివి ఏమైనా రాసిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అపర్ణ హాస్టల్లో ఉంటూ జెన్ఎన్టీయూలో చదువుకుంటోంది. గురువారం రాత్రి గదిలో ఎవరు లేని సమయంలోఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం ఎంతకు తలుపు తీయక పోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు వార్డెన్కు సమాచారం అందించారు.దీంతో తలుపులు పగలగొట్టి చూడగా గదిలోని ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది.