అలా అయితేనే ఆంధ్ర పాలకుల కుట్రలు సాగవు: కల్వకుంట్ల కవిత
కరీంనగర్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినట్లుగా రాజకీయంగా తెలంగాణ బలంగా ఉంటేనే ఆంధ్ర పాలకుల కుట్రలు సాగవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బుధవారంనాడు ఆమె మాట్లాడారు.
అందరినీ కలుపుకొని తెలంగాణను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. గులాబీ కండువే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని చెప్పారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ను పలువురు వీడుతున్నారని తెలిపారు. జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలు పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. రైతులకు రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. ఆంధ్రా పాలకుల పాలనలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలియకుండా ఉండేదని గుర్తు చేశారు.
వచ్చే సీజన్లో రైతులకు 9 గంటల విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications