వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు సిగ్గుచేటు: వెంకయ్య, టెక్కీ ఫ్యామిలీకి సుష్మా ఫోన్

కన్సాస్ కాల్పుల ఘటన పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి జాతి వివక్ష దాడులు సిగ్గుచేటు అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కన్సాస్ కాల్పుల ఘటన పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి జాతి వివక్ష దాడులు సిగ్గుచేటు అన్నారు.

కన్సాస్ కాల్పులు, కూచిభోట్ల శ్రీనివాస్ మృతి పైన అమెరికా సమాధానం చెప్పాలని వెంకయ్య డిమాండ్ చేశారు. ఇలాంటి తీరు అమెరికాకు, ప్రపంచానికి కూడా మంచిది కాదని చెప్పారు.

అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశం అని వెంకయ్య నాయుడు అన్నారు. అలాంటి దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావొద్దని అభిప్రాయపడ్డారు.

<strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి</strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి

Kansas shooting: Venkaiah Naidu condemns Srinivas murder

శ్రీనివాస్ కుటుంబంతో మాట్లాడిన సుష్మా

కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కాన్సాస్ కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. శ్రీనివాస్ మృతదేహం సోమవారం హైదరాబాద్ వచ్చే అవకాశముంది.

అమెరికాతో మాట్లాడాలి: రఘువీరా

కన్సాస్ కాల్పులు, శ్రీనివాస్ మృతి పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. ఇలాంటి దాడులు సరికాదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో మాట్లాడాలని సూచించారు.

ట్రంప్‌ను కలిసిన భారత రాయబారి

అమెరికాలో భారతీయల రాయబారి నవ్‌తేజ్‌ సర్నా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆయన ట్రంప్‌ను కలిశారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఒక అత్యున్నత భారతీయ అధికారి ట్రంప్‌ను కలవడం ఇదే ప్రథమం.

<strong>టెక్కీ శ్రీనివాస్ భార్య సూటి ప్రశ్న: 'ట్రంప్‌కేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'</strong>టెక్కీ శ్రీనివాస్ భార్య సూటి ప్రశ్న: 'ట్రంప్‌కేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'

1980 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన సర్నా అధ్యక్ష ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అమెరికా చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన యూకేలో భారతీయ హైకమిషనర్‌గా పని చేశారు.

మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు నిన్న రాయబారులు అందరూ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వీరిలో సర్నా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ అందరితో విడివిడిగా ఫొటోలు దిగారు.

English summary
Indian engineer Srinivas Kuchibhotla’s body to reach Hyderabad tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X