బాకీ కింద వేలానికి కావూరి స్థలం: ముందుకు రాని బిడ్డర్లు
హైదరాబాద్: యుపిఎ హయాంలో కేంద్రమంత్రిగా ఉండి, ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న కావూరి సాంబశివరావుకు చెందిన హైదరాబాదులోని స్థలం వేలానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

కావూరికి చెందిన ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్' సంస్థ రూ.12 కోట్ల మేర వాణిజ్యపన్ను బకాయి పడటంతో నగరంలోని ఆయన స్థలాన్ని బుధవారం బహిరంగ వేలానికి పెట్టారు. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో పురాతన భవనం ఉన్న 1160 గజాల విక్రయానికి కోర్టు అనుమతితో ప్రకటన ఇచ్చారు.
ఇక్కడ ప్రస్తుతం గజం రూ. 35-40 వేలు ఉండగా, వాణిజ్య పన్నులశాఖ ఏకంగా రూ.లక్షతో మొదలు పెట్టడంతో బిడ్డర్లు ముందుకు రాలేదు. ధర తగ్గిస్తే వేలంలో పాల్గొంటామన్న వినతులతో మరోసారి వేలం నిర్వహిస్తామని అధికారులు వెళ్లిపోయారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications