చంద్రబాబు కుట్రలు, పెద్దల సహాయ నిరాకరణ: కోదండరామ్
ఖమ్మం: రాష్ట్రంలోని 55 వేల మంది ఉద్యోగులను విభజించకపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుట్రలకు ఢిల్లీ పెద్దల సహాయ నిరాకరణ తోడైందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుంటే చిటికె లో ఉద్యోగుల విభజన జరిగిపోతుందని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో టీటీడీసీ భవనంలో తెలంగాణ అభివృద్ధి, ఉద్యోగుల విభజనపై జేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు.ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోనంతవరకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో తాత్సారం జరుగుతుందన్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రధాన పంటలైన వరి, మిర్చికి అనుబంధ పరిశ్రమలను నెలకొల్పి రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీ, స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్ర భుత్వ ఉద్యోగులు నిర్వహించిన 42 రోజుల సకల జనుల సమ్మెను ప్రత్యేక సెలవు పరిగణించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఉద్యోగ ఫ్రెండ్లీ అనడానికి నిదర్శనమని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి చెప్పారు.
వరంగల్ ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయంలో టీఎన్జీవో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడారు. సమ్మెకాలాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవుగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications