సీఎం వెళ్లి ఫైరింగ్ చేశారా!: షబ్బీర్ అలీ, సభలో నయీం ఇష్యూ రగడ
హైదరాబాద్: శాసన మండలిలో నయీం ఎన్కౌంటర్ విషయమై అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండలిలో సైబరాబాద్ కమిషనరేట్ అంశాన్ని, నయీం ఎన్కౌంటర్ అంశాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నయీం డైరీలోని పేర్లను అన్నింటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కోమటిరెడ్డి కొత్త సభ్యుడు అయితే తెలియక మాట్లాడారని అనుకోచ్చునని, కానీ ఐదేళ్లు ఎంపీగా చేశారని కాబట్టి బిల్లుపై చర్చ సమయంలో ఎలా మాట్లాడుతారన్నారు. తాము అన్ని అంశాల పైన చర్చకు సిద్ధమన్నారు. గ్యాంగ్ స్టర్ నయీం అంశం పైనా చర్చకు సిద్ధమని చెప్పారు.

ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కల్పించుకొని.. నయీం ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ యావత్తు ఆనందిస్తుందని చెప్పారు.దీనిపై షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెళ్లి ఫైరింగ్ చేశారా, లేక ఫైరింగ్కు ఆర్డర్ ఇచ్చారా అని ఎద్దేవా చేశారు.
దీనిపై నాయిని మాట్లాడుతూ.. తాను ఈ సంఘటనకు తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పానని అన్నారు.
కోమటిరెడ్డి సైబరాబాద్ కమిషనరేట్ విభజన పైన కూడా మాట్లాడారు. విభజన శాస్త్రీయంగా లేదన్నారు. నల్గొండ ప్రజలకు దీని వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనిని మంత్రులు తప్పుబట్టారు. దీనిపై షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి నల్గొండ జిల్లా సభ్యుడు కాబట్టి అక్కడి ప్రజల సమస్యను లేవనెత్తారన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications