ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్కు వేల కోట్ల ముడుపులు: కోమటిరెడ్డి సంచలనం
రీడిజైనింగ్ పేరుతో ఆంధ్రా కాంట్రక్టర్లకు పనులు అప్పగించి.. సీఎం కేసీఆర్ వేలకోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
నల్గొండ: వరంగల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా నివేదన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ శ్రేణులను సన్నాసులు, దద్దమ్మలంటూ మరోసారి నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఎటాక్ లు ఎక్కువయ్యాయి.
కాంగ్రెస్ నేతలు పోటీ పడి మరీ కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టింది కేవలం తమ జేబులు నింపుకోవడానికే అన్న తరహాలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

రీడిజైనింగ్ పేరుతో ఆంధ్రా కాంట్రక్టర్లకు పనులు అప్పగించి.. సీఎం కేసీఆర్ వేలకోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇక ఓయూలో జరిగిన శతాబ్ధి ఉత్సవాల్లో కేసీఆర్ నోరు మూగబోవడంపై కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వైఖరి సిగ్గు చేటని, ఆ స్థానంలో మరొకరు ఎవరున్నా.. సీఎం పదవికి రాజీనామా చేసేవారని అన్నారు.
ఇక తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్లే పార్టీ మారుతారని ఎద్దేవా చేశారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications