కేటీఆర్కు అరుదైన గౌరవం: వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం, రాష్ట్రమంత్రికి తొలిసారి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది.
చదవండి: 'కొందరు నీచులు నేర్పుతారా, బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుంది'
వరల్డ్ ఎకనామిక్ తొలిసారి ఓ రాష్ట్రమంత్రిని ఆహ్వానించడం విశేషం. 48వ ప్రపంచ ఆర్థిక సమావేశాలు స్విట్జర్లాండ్లోని దావోస్ పట్టణంలో జనవరి 18, 19వ తేదీలలో జరగనున్నాయి.
సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, ఎన్జీవో ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, మీడియా ప్రముఖులు రానున్నారు.

కేంద్రమంత్రులు, రాష్ట్రాల అధినేతలకు మాత్రమే ఇప్పటి వరకు వరల్డ్ ఎకనమిక్ సదస్సు ఆహ్వానాలు అందాయి. తొలిసారి ఒక రాష్ట్ర మంత్రికి ఆహ్వానం వచ్చింది. సదస్సులో పాల్గొనే అవకాశం రావటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: రజనీకాంత్-పవన్ కళ్యాణ్: అక్కడే ఇద్దరి మధ్య తేడా!
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయంలో మంత్రి కేటీఆర్ భాగస్వామ్యం.. తెలంగాణ పెట్టుబడుల ముఖచిత్రంగా ఉన్న తీరును ఫోరం పరిగణలోకి తీసుకున్నదని అంటున్నారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications