హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోడలపై రాస్తే.. కఠిన చర్యలు తప్పవు, సొంత పార్టీ నేతలైనా సరే : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నగరంలో గోడలపై రాతలు రాసేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఈ విషయంలో సొంత పార్టీ నేతలనైనా ఉపేక్షించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. గోడ‌ల‌పై రాత‌లు రాసి వాటిని పాడుచేస్తే చ‌ర్య‌లు తప్పవన్నారు.

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో శనివారం నాడు జరిగిన తెలంగాణ క‌ళాకారుల మేళ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హైద‌రాబాద్ అంద‌మైన న‌గ‌రమ‌ని, ఐటీకి కేంద్రంగా హైదరాబాద్ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాల్సిన అవసరముందని గుర్తు చేశారు.

KTR warned to stop writings on Wall

హైదరాబాద్ స్వరూపాన్ని కళాకారులు మార్చేస్తుంటే.. వారికి ఆటంకాలు కలిగించడం సబబు కాదన్నారు. అభివృద్ధిలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుందని, ప్రపంచ ప్రసిద్ది చెందిన ఐదు మేటి కంపెనీలు ఇక్కడ కొలువయ్యాయని తెలిపారు.

English summary
Telangana IT minister was attended Kalakarula Mela held at necklase road. On this occasion he shared few words regarding hyderabad and its image
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X