లోకసభ ఎన్నికలు 2019: మల్కాజిగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో మల్కాజిగిరి ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ, 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి మల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత మల్లారెడ్డి తెరాసలో చేరారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన భీమ్ సేన్ పైన కాంగ్రెస్ అభ్యర్థి సర్వే 93వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి దేవేందర్ గౌడ్ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ, జనసేన మద్దతుతో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి గెలిచారు. ఈయన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మైనంపల్లి హన్మంత రావు పైన 28వేల స్వల్ప మెజార్టీతో మల్లారెడ్డి గెలిచారు. మల్లారెడ్డికి 5,23,336 ఓట్లు రాగా, మైనంపల్లికి 4,94,965 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 2,33,711 ఓట్లు వచ్చాయి. ఆయన అంతకుముందు యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు.

మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో 31,83,325 ఓటర్లు ఉన్నారు. ఇందులో 17,23,413 పురుష ఓటర్లు, 14,59,912 మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 16,20,397 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 51 శాతం మాత్రమే. ఓటేసిన వారిలో 8,78,093 పురుషులు, 7,42,304 మహిళలు ఉన్నారు.
మల్కాజిగిరి లోక్సభ పరిధిలో 28,44,921 జనాభా ఉంది. ఇందులో గ్రామీణ జనాభా అతి స్వల్పం. పట్టణ జనాభా ఎక్కువగా ఉంది. గ్రామీణ జనాభా 7.38%గా ఉంటే, పట్టణ జనాభా 92.62%గా ఉంది. ఇందులో ఎస్సీలు 9.20%, ఎస్టీలు 2.40% ఉన్నారు.
మల్లారెడ్డి వ్యాపారవేత్త. ఈ నియోజకవర్గం పరిధిలోనే పలు విద్యాసంస్థలకు అధినేత. పన్నెండో తరగతి పాస్ అయ్యారు. సభలో 21 చర్చల్లో పాల్గొన్నారు. ఇది తెలంగాణ యావరేజ్ 36.6 శాతం, నేషనల్ యావరేజ్ 63.7 శాతంగా ఉంది. ఇతను ఒక ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఇది తెలంగాణ యావరేజ్ 2, నేషనల్ యావరేజ్ 2గా ఉంది. లోకసభలో 426 ప్రశ్నలు అడిగారు. ఇది తెలంగాణ యావరేజ్ 284, నేషనల్ యావరేజ్ 271గా ఉంది. సభకు హాజరు 80 శాతం. తెలంగాణ యావరేజ్ 69 శాతంగా ఉంది. ఎంపీ లాడ్స్ నుంచి రూ.17.66 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశారు.
మల్కాజిగి లోక్సభ నియోజకవర్గం పరిధిలో పలు మధ్య తరహా పరిశ్రమలు ఉన్ననాయి. ఈ నియోజకవర్గం ఉన్న జిల్లాను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతంగా గుర్తించింది. గతంలో మల్కాజిగిరి ఓ పెద్ద గ్రామంగా ఉండేది. క్రమంగా నగరం విస్తరించింది. దీంతో మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది.
2002లో ఏర్పడిన కమిటీ సూచన మేరకు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన లోక్సభ నియోజకవర్గం మల్కాజిగిరి. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత రెండేళ్లకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 12వ తరగతి వరకు చదివిన మల్లారెడ్డి.. ఇప్పుడు అనేక విద్యాసంస్థల అధినేత. సికింద్రాబాద్కు సమీపంలో ఉంటుంది. దీని పరిధిలో మల్కాజిగిరి మున్సిపాల్టీ, అల్వాల్ మున్సిపాల్టీ ఉన్నాయి.












Click it and Unblock the Notifications