పెట్రోలింగ్ వాహనంపైకి దూసుకెళ్లిన లారీ: పోలీసులకు తీవ్రగాయాలు(ఫొటోలు)
హైదరాబాద్: నగరంలోని హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్రోడ్డుకు సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది.

లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పోలీస్ పెట్రోలింగ్ వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లారీ ముందు భాగం దెబ్బతినడంతో క్రేన్ సాయంతో దానిని పక్కకు తరలించారు.

మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా: 20మందికి గాయాలు
మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications