భార్యపై అనుమానం: పిల్లలను నేలకేసి కొట్టిన భర్త, ఒకరి మృతి
నిజామాబాద్: భార్యపై అనుమానంతో ఆమె భర్త పిల్లలపై దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి ప రిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నిజమాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తల్వేద గ్రా మంలో చోటు చేసుకుంది.
సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - నందిపేట మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన బట్టు సాయిలు కొన్ని రోజులుగా భార్య అనితపై అనుమానం పెంచుకొని వేధిస్తున్నాడు. వికలాంగుడైన సాయిలు తరచూ భార్య అనితపై అనుమానంతో పిల్లలు తనకు పుట్టలేదని దాడి చేసేవాడు.
వారికి ముగ్గురు సంతానం సంతోష్, సాగర్ (4), అనిత. మూడు రోజులుగా చిన్న కొడుకు సాగర్, పల్లవిపై దాడి చేసినట్లు సమాచారం. మంగళవారం సైతం కొడుకు సాగర్, కూతురు పల్లవిని నేలకు వేసి బాదాడని తెలిసింది. కొడుకు సాగర్ను గ్రా మంలోని ఆర్ఎంపీ వైద్యుడి వ ద్దకు తీసుకెళ్లగా అతను పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తెలిపాడు.
దీంతో 108 అంబులెన్స్ లో జిల్లా కేంద్ర వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతిచెందాడు. పల్లవి జిల్లా కేం ద్ర వైద్యశాలలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న ఎస్సై జాన్రెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్న అనితతో మాట్లాడారు. వివరాలు తెలుసుకొ ని, నిందితుడు సాయిలును అదుపులోకి తీసు కున్నామని పోలీసులు తెలిపారు.