సంగారెడ్డిలో దారుణం.. నడిరోడ్డుపై యువకున్ని నరికి చంపారు..
రుద్రారం : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నేషనల్ హైవేపై పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని హత్య చేశారు. పటాన్చెరు మండలం రుద్రారం వద్ద జాతీయ రహదారిపై మహబూబ్ అనే యువకున్ని నరికి చంపారు. మోటర్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మహబూబ్పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. దీంతో అతను స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.
నడి రోడ్డుపై హత్య జరగడంతో రోడ్డుపై వెళ్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అయితే నడిరోడ్డుపై పట్టపగలే ఇంత ఘోరం జరుగుతున్న నిందితుడి చేతిలో కత్తి ఉండటంతో ఎవరూ అడ్డుకోలేకపోయారు. మహబూబ్ను నరికి చంపిన అనంతరం దుండగులు ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.

ఐదునెలల క్రితం రుద్రారంలో జరిగిన మర్డర్ కేసులో మహమూద్ నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మహబూబ్ చేతిలో హత్యకు గురైన వ్యక్తి సంబంధీకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్డర్ విషయం తెలిసి ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications