కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులా కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నాడు: మంత్రి కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతుంది. మంత్రి కేటీఆర్ ప్రచార పర్వంలో విస్తృతంగా పర్యటిస్తూ రోడ్ షోలలో పాల్గొంటున్నారు. తాజాగా కామారెడ్డి లో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అక్కడ సంచలన కామెంట్స్ చేశారు. కామారెడ్డి ఎన్నికల బరిలో సీఎం కేసీఆర్ ఉండడంతో అక్కడ ప్రచారాన్ని సాగిస్తున్న మంత్రి కేటీఆర్ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా కెసిఆర్ కామారెడ్డికి వచ్చారని వ్యాఖ్యలు చేశారు.
గత పాలనకు, కేసీఆర్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని, ఆచితూచి ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉండేవో ప్రజలు ఆలోచించాలన్నారు. గతంలో ఇంత వరి ధాన్యం పండుతుండేనా? చెప్పాలని ప్రశ్నించారు. గత రెండు సార్లు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు కూడా అభివృద్ధి కావాలంటే గులాబీ పార్టీని గెలిపించాలని కేటీఆర్ అన్నారు.

గతంలో ఎవరూ బీడీ కార్మికులకు పట్టించుకోలేదు అని పేర్కొన్న కేటీఆర్ దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ నే , పెన్షన్ లు ఇచ్చేది కేసీఆర్ నే అని ఆయన పేర్కొన్నారు.
మోడీ పెంచిన సిలిండర్ ధరను కెసిఆర్ తగ్గిస్తున్నాడు అని, మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కెసిఆర్ ఐదువేల రూపాయల పెన్షన్ ఇస్తారని, తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 18ఏళ్లు నిండిన మహిళలందరికీ 3 వేల పెన్షన్ ఇస్తాం అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి 5లక్షల రూపాయల జీవిత భీమా కల్పిస్తామని తెలిపారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేసి మళ్ళీ పట్వారీ వ్యవస్థ తీసుకువస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. మనకు మూడు గంటల కరెంట్ కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా ఆలోచించాలన్నారు. మనకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కామారెడ్డి వస్తే ఇక్కడి రూపురేఖలు మారుతాయన్నారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను గెలిపించాలన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications