వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రైతుల కన్నెర్ర.. కాంటాలు ధ్వంసం; గిట్టుబాటు ధరకు డిమాండ్

|
Google Oneindia TeluguNews

మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. ఎనుమాముల మార్కెట్ వద్ద మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. గిట్టుబాటు ధర కల్పించాలని వారు మార్కెట్ యార్డ్ వద్ద ధర్నాకు దిగారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని గిట్టుబాటు ధర కోసం రైతులు ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

పడకేసిన తెలంగాణా: ఏ తలుపు తట్టినా జ్వర బాధితులే; ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలుపడకేసిన తెలంగాణా: ఏ తలుపు తట్టినా జ్వర బాధితులే; ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు

 గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ఆందోళన

గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ఆందోళన


తేజ మిర్చి పంటకు 17, 200 రూపాయల ధర పలికిన ప్పటికీ ఎనుమాముల మార్కెట్లో 9 వేల నుంచి 13 వరకు మాత్రమే మిర్చి పంటను దళారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వ్యాపారులతో అధికారులు చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి ధరలను పునఃసమీక్షించాలని, ధరలను సవరించాలని వ్యాపారులకు అధికారులు సూచించారు.

 రైతులతో చర్చలు జరుగుతుండగానే, వ్యాపారుల కాంటాలు.. భగ్గుమన్న రైతన్నలు

రైతులతో చర్చలు జరుగుతుండగానే, వ్యాపారుల కాంటాలు.. భగ్గుమన్న రైతన్నలు


ఈ విషయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులను అనునయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ఏమాత్రం వినిపించుకోలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బయట తేజ మిర్చి పంట ధర 17 వేలకు పైగా ఉందని, తమకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్ణయించిన ధరకు రెండు వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రైతులతో చర్చలు జరుగుతుండగానే, మరోవైపు వ్యాపారులు కాంటాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

కాంటాలను ఎత్తిపడేసి... డీసీఎం వాహన అద్దాలను ధ్వంసం చేసిన రైతులు

కాంటాలను ఎత్తిపడేసి... డీసీఎం వాహన అద్దాలను ధ్వంసం చేసిన రైతులు

కాంటాల నిర్వహణను అడ్డుకున్నారు. తూకం పూర్తయిన బస్తాలను ట్రాక్టర్ల పై నుండి కింద పడేశారు. మార్కెట్‌లో వాహనాలలో లోడ్ చేసిన మిర్చి బస్తాలను ఎత్తిపడేసి మిర్చిని వెదజల్లారు. ఈ క్రమంలో కాంటాలతో పాటుగా, డీసీఎం వాహనాల అద్దాలను సైతం రైతులు ధ్వంసం చేశారు. రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Recommended Video

వరి పంట వేయొద్దని చెప్పేందుకు కేసీఆర్ ఎవరు..? || Oneindia Telugu
 మిర్చి పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది .. కానీ గిట్టుబాటు లేదని రైతుల ఆవేదన

మిర్చి పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది .. కానీ గిట్టుబాటు లేదని రైతుల ఆవేదన

మిర్చి రైతులు ఇప్పటికే ఆరుగాలం పండించిన పంట చేతికి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈసారి అకాల వర్షాలు, మిర్చి పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడి చాలా తక్కువ వచ్చిందని, ఈ సమయంలో కూడా గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మిర్చి రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర చెల్లించకుండా దళారులు దోచుకోవడానికి అడ్డుకోవాలని, ప్రభుత్వం దళారీ దోపిడి వ్యవస్థకు చెక్ పెట్టి, గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Mirchi farmers were smashed the weighing mechines in the Enumamula market .farmers done a protest in front of the market office demanded MSP on Chillies. As the situation became tense, the police rushed to the scene
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X