శభాష్ రేఖా నాయక్: వాహనం ఆపి ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే
ఎవరికైనా ప్రమాదం జరిగిందనుకో సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. చాలా మంది మనకెందుకులే అనుకుంటారు. అలా చూసి వెళతారు. కొందరే దగ్గరికీ వెళ్లి మరీ సాయం చేస్తారు. ఇక నేతలు/ అధికారులు అయితే పట్టించుకోవడం అరుదు. వాళ్లు సాయం చేస్తే సెన్సేషన్ అవుతుంటుంది. అలాంటి వారి జాబితాలో అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నిలుస్తారు. మంగళవారం ఆమె ప్రమాదానికి గురయిన వ్యక్తికి సాయం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రోడ్డు ప్రమాద బాధితుల పట్ల కరుణ చూపారు. మంగళవారం రోజున ఆమె కడెం పర్యటన ముగించుకుని వస్తున్నారు. నిర్మల్ వెళుతుండగా.. ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివార్లలో ఓ కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. వారికి సాయం చేసేందుకు ఎవరూ లేరు. ఇది గమనించిన ఎమ్మెల్యే రేఖా నాయక్ తన వాహనాన్ని నిలిపివేశారు. వాహనం దిగి మరీ పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాదంలో ఆ కారులో వారు తీవ్ర గాయపడ్డారని గుర్తించారు. తన సిబ్బంది సాయంతో వారిని తన కారులోకి చేర్చారు. వారిని ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పి ఉంటది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ తోటి వారు కూడా అదేవిధంగా స్పందించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే రేఖా నాయక్ రియాక్ట్ అయ్యారు.
ప్రమాదం జరిగిన గంటలోపు ఎవరైనా ఆస్పత్రికి వెళితే ఇబ్బంది ఉండదు. చికిత్స అంది.. ప్రాణాపాయం తప్పుతుంది. ఇదివరకు జరిగిన చాలా ప్రమాదాల్లో వైద్యులు కాసేపు ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు. దానిని కొందరు చక్కగా అమలు చేస్తున్నారు. అందులో ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా నిలిచారు. ఆమె చేసిన మంచి పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. శభాష్ అంటూ కొనియాడుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications