కవిత బ్రహ్మాస్త్రం, టార్గెట్ ఫిక్స్ - వారికి ఉక్కిరి బిక్కిరి..!!
ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు ప్రధాన పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కులగణన.. బీసీ రిజర్వే షన్లతో మైలేజ్ సాధించాలని భావించిన వారికి కవిత కార్యాచరణ సమస్యగా మారుతోంది. కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావటంతో కవిత రాజకీయంగా చర్చల్లో నిలిచారు. ఇప్పుడు కవిత తాజా అస్త్రంతో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్నారు. ఈ నెల 17న కవిత రైల్ రోకో కు పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి మద్దతు కోరారు. ఇదే సమయంలో ఢిల్లీ వేదికగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.
కవిత అస్త్రం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ అస్త్రం సంధించారు. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పైన గళం విప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓబీసీనని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీకి ఆ వర్గాలకు న్యాయంచేసే అవకాశం లభించిందని చెబుతూనే.. తన డిమాండ్ వినిపించారు. ఆమోదం పొంది 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17న నిర్వహించబోయే రైల్రోకోలో భాగంగా ఒక్క రైలునూ కదలనివ్వబోమని, డెక్కన్ నుంచి ఢిల్లీకి రైళ్లను రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కీలక మలుపు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్ల అమలు చేయవచ్చని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉండదని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఉంటారని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే కవిత రైల్ రోకో లో భాగస్వాములు కావలంటూ లేఖలు రాసారు. కవిత డిమాండ్కు బీసీ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణలో తాము చేపట్టిన బీసీ కుల గణన సాహసోపేత నిర్ణయంగా రేవంత్ ప్రభుత్వం ప్రతీ సందర్బంలో ప్రచారం చేసుకుంటోంది. ఈ సమయంలో కవిత బీసీ నినాదంతో చేపడుతున్న ఆందోళనలు ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి.

కవిత డిమాండ్తో
రైల్ రోకో ఒక రోజు మాత్రమే ఉంటుందని.. ట్రైలర్ చూపించాలి కాబట్టి ఒక రోజుకే పరిమితం చేస్తున్నామని కవిత చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే నిరవధిక రైల్ రోకో చేపడతామని కవిత హెచ్చరించారు. దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి ఓబీసీల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ కల్పన పైన ఆదేశించాలని కవిత సూచించారు. తమిళనాడు మోడల్లో తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఇక, ఇప్పుడు కవిత సంధించిన బీసీ అస్త్రంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications