డబ్బు కోసం కొడుక్కి వాతులు పెట్టిన తల్లి(ఫోటోలు)
హైదరాబాద్: కన్న కొడుకుకి తల్లే ఇనుప రాడ్డును కాల్చి వాతలు పెట్టిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేరేడ్మెట్ సీఐ చంద్రబాబు కథనం ప్రకారం వినాయక్ నగర్లో నివాసం ఉంటున్న రేష్మి అనే మహిళకు 2008లో వివాహం జరిగింది.
ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. పెళ్లికి ముందే ఆమెకు మహేష్ అనే వ్యక్తితో వివాహేతల సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భర్త విడాకులు తీసుకున్నాడు. ఇద్దరు కుమారుల్లో పెద్ద వాడైన అద్నాన్ (6)ను తన అక్క దగ్గర, చిన్నవాడైన అయాన్ (4)ను తనల్లి గౌసియాబేగం వద్ద ఉంచింది.
డబ్బు కోసం కొడుక్కి వాతులు పెట్టిన తల్లి
ఈ క్రమంలో తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని రూ. 50 వేలు కావాలని రేష్మి తన తల్లిన మూడు నెలలు క్రితం కోరింది. అందుకు గౌసియాబేగం నిరాకరించడంతో పాటు రెండు నెలల క్రితం అయాన్ను తనతో పాటు తెచ్చుకుంది రేష్మి.
డబ్బు కోసం కొడుక్కి వాతులు పెట్టిన తల్లి
ఈ నేపథ్యంలో గౌసియాబేగం సోమవారం మౌలాలిలో ఉన్న కూతురు ఇంటికి వచ్చి చూసేసరికి అయాన్ పెదవులు, వీపు, మర్మాంగంపైన వాతలతో అల్లాడుతున్నాడు.
డబ్బు కోసం కొడుక్కి వాతులు పెట్టిన తల్లి
ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యలకు తెలియజేయడంతో రేష్మి మేనమామ రియాజ్, అయాన్ను చికిత్స్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
డబ్బు కోసం కొడుక్కి వాతులు పెట్టిన తల్లి
డబ్బుల కోసమే చిన్నారి అయాన్ను చిత్రహింసలకు గురి చేశారంటూ రియాజ్ నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రేష్మి, మహేష్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.